TTD:మరింత విస్తృతంగా ధార్మిక ప్రచారం

41
- Advertisement -

యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కోరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. మంగళవారం రుషికేష్ లో సతీసమేతంగా స్వరూపానంద స్వామిని గౌరవపూర్వకంగా కలిశారు.

స్వామికి శ్రీవారి ప్రసాదాన్ని అందించి శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా స్వరూపానంద స్వామి మాట్లాడుతూ…భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్ గా నడకదారిని అభివృద్ధి చేయాలని సూచించారు. వేద పారాయణదారుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు.

ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మరింత విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలని చెప్పారు.అనంతరం కరుణాకర రెడ్డి దంపతులను శారదా పీఠాధిపతి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామిని కూడా చైర్మన్ దంపతులు శాలువాతో సన్మానించారు.

Also Read:మహేష్‌తో అక్కడ ప్లాన్ చేశాడు!

- Advertisement -