ఆర్చరీలో సత్తా చాటిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు

36
- Advertisement -

ఇటీవల సౌత్‌ కొరియాలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ మాస్టర్ గేమ్స్‌లో టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. ఆర్చరీ విభాగంలో టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం అంజలి 18మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా కరీంనగర్ జోనల్ వర్క్‌ షాప్ మెకానిక్ కే. కిషన్ 30 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా మాస్టర్ గేమ్స్‌లో వీరు సత్తా చాటడంతో ఇంటర్‌నేషనల్‌ ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 12 నుంచి 20వరకు జరిగాయి.

Also Read: TSPSC:అ 37మంది డిబార్‌

ఆర్టీసీ ఉద్యోగులు ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో సత్తా చాటి 2పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ సజ్జనార్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరిని బస్‌భవన్‌లో అభినందించారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భవిష్యత్ లో జరిగే పోటీల్లోనూ పాల్గొని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

Also Read: TSLPRB:ఫలితాలు విడుదల

- Advertisement -