పోలీస్ నియమాకాలకు సంబంధించి మహిళా అభ్యర్ధులకు టీఎస్ఎల్ఆర్బీ కీలక ప్రకటన జారీ చేసింది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడిన మహిళా అభ్యర్థులు కీలక సూచనలు చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మహిళా అభ్యర్థుల్లో బాలింతలు గర్భం దరించిన వారు కూడా ఉండటంతో వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహణను వాయిదా వేసింది. వారికి ఫైనల్ పరీక్షల్లో అర్హత సాధించినట్లైతే నెల రోజుల్లోపు ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించింది.
తాజాగా దీనికి సంబంధించిన హైకోర్టు ఆదేశాల మేరకు బాలింతలు గర్భిణులు తమకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను జనవరి 31లోపు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో సమర్పించాలని టీఎస్ఎల్ ఆర్బీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాతపూర్వక హామీ పత్రాన్ని కూడా మెడికల్ సర్టిఫికెట్లతో జతపర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఫైనల్ పరీక్షలను ఏప్రిల్ మే నెల్లో నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి…