టీఆర్ఎస్ అభ్యర్థులకు పారామెడిక‌ల్ అసోసియేష‌న్ మ‌ద్ద‌తు

173
harish rao
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పారామెడికల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. మహబూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న వాణీదేవికి, ఖమ్మం-నల్ల‌గొండ‌- వరంగల్ నుండి బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతిస్తున్నట్లు తెలంగాణ పారామెడికల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్, వొకేషనల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ ప్రతినిధులు ప్ర‌క‌టించారు.

హైదరాబాద్‌లో ఆర్థికశాఖ‌ మంత్రి హరీశ్ రావును కలిసి ఈ మేరకు అసోషియేషన్ కమిటీలు తీర్మానం చేసిన మద్దతు లేఖను అన్ని జిల్లాల కమిటీ నేతలతో కలిసి అందజేశారు. తమ ప్రభుత్వం పారామెడికల్ కళాశాల, వొకేషనల్ కళాశాలల సమస్యలను పరిష్కరించినందుకు గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్ధతు తెలపడం అభినందనీయమన్నారు హరీశ్‌ రావు. ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని.. మీ ఓట్లతో పాటు ఓటు హక్కు ఉన్న విద్యార్థులు, బంధువులతోను టీఆర్ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయించాలని మంత్రి కోరారు.

- Advertisement -