తెలంగాణ సమాజం టీఆర్ఎస్‌వైపే: జగదీష్ రెడ్డి

232
trs
- Advertisement -

తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ వైపే ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.
నల్లగొండ పట్టణంలో మంగ‌ళ‌వారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళ‌నం నిర్వ‌హించారు.

గ‌్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడేందుకు ఏ అంశం లేక‌నే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నార‌ని అన్నారు. ప్రధాని మోడీ దేశ‌ ప్రజలకు చేసిందేమి లేద‌న్నారు. కాగా ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించిన ఘనుడ‌న్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెప్పిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

తెలంగాణలో ఆకలి అన్నదే లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆకలిని పారద్రోలార‌న్నారు. 24 గటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగల మార్చారన్నారు. ప్రైవేటు రంగంలో 15 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్ర‌భుత్వానిద‌న్నారు.

- Advertisement -