ధరణిలో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగించిన హైకోర్టు..

178
dharani
- Advertisement -

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న హైకోర్టు.. ధరణిపై 2 పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. మరో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తోసిపుచ్చింది.

ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ కోరారు. ఏజీ విజ్ఞప్తికి స్పందించిన హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ విచారణ వాయిదా వేసింది.

- Advertisement -