ఈట‌ల భూముల కబ్జా వ్య‌వ‌హారం.. నోటీసులు జారీ..

98
- Advertisement -

ఈట‌ల రాజేంద‌ర్ భూముల వ్య‌వ‌హారంలో మ‌రోసారి అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమున హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 16,17,18న పూర్తి విచారణ చేపట్టనున్నారు అధికారులు. మెదక్ జిల్లా… మాసాయిపేట మండలం అచం పేట, హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా..? అరోపణల నేపథ్యంలో ఈ కేసును విచారించనున్నారు. అయితే ఈ కేసులో జూన్ లోనే నోటీసులు జారీ చేసినా…కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా వేశారు అధికారులు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 నుండి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనుంది.

- Advertisement -