అసెంబ్లీ సమావేశాలు..సర్వం సిద్ధం

72
assembly
- Advertisement -

నేటి నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడనుంది.

అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి,ఏఏ అంశాలపై చర్చించాలని అన్నదానిపై బీఏసీలో నిర్ణయించనున్నారు.

దళితబంధును ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైనా సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -