బండి..ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో: వినోద్ కుమార్

81
viniod kumar
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాస్తవాలు ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడాలన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. వరి ” సాగుపై తెలంగాణ రాష్ట్ర లెక్కలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు 59 లక్షల ఎకరాలు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు.

రాష్ట్రంలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ చెబితే తప్పు పడతారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలపై బీజేపీ నేతలు, బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారన్నారు. వరి సాగు లెక్కలపై అబద్దాలు చెప్పిన బండి సంజయ్..వాస్తవాలు తేలిన ఇప్పుడు మొఖం ఎక్కడ పెట్టుకుంటావ్ అని ప్రశ్నించారు.

- Advertisement -