కరీంనగర్ లో వేగంగా స్మార్ట్ సిటీ పనులు : వినోద్ కుమార్

129
vinod kumar
- Advertisement -

కరరీంనగర్‌లో శరవేగంగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయని తెలిపారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్…రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా కరీంనగర్ అభివృద్ధి అవుతుందన్నారు. పివి నరసింహరావు విగ్రహం ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పోరేషన్ తీర్మానం చేయడం జరిగిందన్నారు. హేరిటేజ్ బిల్డింగ్ గా స్కూల్ బిల్డింగ్ ను అత్యాధునికంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం అవుతుందన్నారు.

ఇప్పటి వరకూ 196 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని…. మరో 200 కోట్లు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -