కాలిఫోర్నియాలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

217
TRS USA Formation Day Celebrations
- Advertisement -

కాలిఫోర్నియా రాష్ట్రంలోని నెవార్క్ నగరంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నవీన్ జలగం స్వాగత ఉపన్యాసం తో కార్యక్రమాన్ని ప్రారంభించారు,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని మరియు ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీని రజనికాంత్ ఖొసనం పుష్ప గుచం తొ స్టేజి మీదకి ఆహ్వానించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి, ఫ్రొఫ్ జయశంకర్ సర్, జల వనరుల నిపుణులు విద్యసాగర్రావుకి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

నవీన్ జలగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలే కాకుండా తెలంగాణ ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలని చేపట్టారని అన్నారు. భాస్కర్ మద్ది ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, చిన్మయి గారు ప్రదర్శించిన తెలంగాణ నృత్య రూపకం పేరిణి అందరిని ఆకట్టుకుంది, తెలంగాణ జానపద గేయాలను ప్రసాద్ ఊటుకూరు, భాస్కర్ కాల్వ, కృష్ణ వేముల పదారు అనంతరం చిన్నారుల నృత్యాలతో కార్యక్రమం ఆధ్యంతం అట్టహాసంగా జరిగింది.

TRS USA Formation Day Celebrations
అనిల్ ఎర్రబెల్లి మాట్లాడుతూ సంక్షేమ పధకాల గురించి వివరించారు, ర్హిషికేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల వాళ్ళ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పెంపొందుతుందని వెల్లడించారు. అభిలాష్ రంగినేని మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఉద్యమ సమయంలో మరియు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా చేస్తున్న సేవలను కొనియాడారు.

అనంతరం ఫ్రీమాంట్ మేయర్ లిలీ మెయి మాట్లాడుతూ ఫ్రీమాంట్ నగరం లో వివిధ రకాల కల్చర్స్ ని ప్రోత్సహిస్తున్నాము అని వెల్లడించారు, తనను అహ్వాహించునందుకు తెలుగులో ధన్యవాదాలు తెలిపారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ పధకాలు తెలంగాణ రాష్ట్రంలో సి.ఎం. కెసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సస్యామలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్ట్ ల ను పూర్తి చేసి సాగు నీరు విడుదల చేశామన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కుల వృత్తులను ప్రోత్సహిస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగయిన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించాం అన్నారు. పేదింటి ఆడపడుచుల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్ధిక సాయం చేస్తున్నారని తెలిపారు. ఆసరా పధకం ధ్వారా వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కలిపిస్తుందన్నారు.

TRS USA Formation Day Celebrations
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో నెంబర్ వన్ చేసేసినందుకు సీఎంకెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు తో పాటు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి ఎకరాకు 4000 రూపాయలు అందిస్తున్న ఘనత సీఎంకెసిఆర్ కె దక్కుతుందని అన్నారు. అమరుల త్యాగ ఫలితం గానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామన్నారు. అమరులు కలలు కన్న బంగారు తెలంగాణ సాకారం అవుతుందని తెలిపారు. అందుకు తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. బే ఏరియాలో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు శ్రీనివాస్ పొన్నాల, తేజస్విని వడ్డెరాజ్, వంశీ కొండపాక, ఉదయ్ జొన్నల, కరుణాకర్, సాగర్, రజ్, రం, శశాంక్, షషి, హరిందర్, సంతోష్, విజయ్, ఛంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -