టీఆర్ఎస్‌తోనే అచ్చంపేట అభివృద్ధి: ఎన్నారై టీఆర్ఎస్

206
nri
- Advertisement -

అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎన్నారై తెరాస బృందం ముందుగా ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారిని క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని వారి సూచనలు సలహాల మేరకు ఎమ్మల్సీ నారాయణ రెడ్డి గారితో కలిసి వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన అభివృద్ధిని అలాగే ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు అచ్చంపేట వచ్చి ప్రారంభించిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. 

ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మీడియాతో మాట్లాడుతూ, సాగు, తాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే కాకుండా, రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ ఉత్తర భాగం రోడ్డు విస్తరణ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడమే కాకుండా, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరిక మేరకు మున్సిపాలిటీ అభివృద్డికై రూ. 25 కోట్లు అచ్ఛంపేట మున్సిపాలిటికి కేటాయిస్తామని హామీ ఇచ్చారని ప్రజలకు గుర్తు చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే తెరాస ప్రభుత్వం తోనే అచ్చంపేట అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా విజ్ఞతతో ఓటేసి 20 వార్డుల్లో తెరాస అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ఎన్నారై తెరాస యూకే కార్యదర్శి సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ , తెలంగాణాలో ఎటువంటి ఎన్నికైనా ప్రజలంతా తెరాస కే ఓటేసి కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చుకోవాలని, అప్పుడే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని కాబట్టి ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి అచ్చంపేట మునిసిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.

 ఎన్నారై తెరాస నాయకుడు మల్లేష్ పప్పుల మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు అచ్చంపేట అభివృద్ధి కై ప్రత్యేక దృష్టి పెట్టారని , ప్రజలంతా తెరాస కి ఓటేసి గెలిపిస్తే అచ్చంపేట రాష్ట్రంలోనే గొప్ప మున్సిపాలిటీ కేంద్రంగా మారుతుందని తెలిపారు.  ప్రచారానికి సహకరించి ప్రోత్సహించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి , ఎమ్మల్సీ నారాయణ రెడ్డి గారికి , తెరాస అభ్యర్థులకు, స్థానిక నాయకులకు , కార్యకర్తలకు ఇతరులకు ఎన్నారై తెరాస బృందం కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -