బీజేపీ కళ్లబొల్లి మాటలు నమ్మోద్దు: హరీశ్‌ రావు

128
- Advertisement -

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. ఝూఠాగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని…
బీజేపీ నాయ‌కుల క‌ళ్లిబొల్లి మాట‌లు న‌మ్మొద్దని తెలిపారు.

లింగారెడ్డిప‌ల్లి, రేణుక న‌గ‌ర్ వార్డుల్లో ప్రచారం సందర్భంగా మాట్లాడిన హ‌రీష్….బీజేపీ ప్ర‌భుత్వంలో అన్ని ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు. పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోని నాయ‌కులు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ‌కు కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చింద‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ కేంద్రం తెలంగాణ‌కు రూ. 135 ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

- Advertisement -