నల్లకుంటలో బత్తాయి పండ్ల పంపిణీ

229
bathai festival
- Advertisement -

టీ ఆర్ యస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు, పార్టీ యువ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లకుంట డివిజన్ లో బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.

స్ధానిక శివాలయం టెంపుల్ దగ్గర బత్తాయి పండ్లు పంపిణి చేశారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. C విటమిన్ పుష్కలంగా లభించే బత్తాయి పండ్లని తిని, రోగనిరోధక శక్తి పెంపొందించుకుందాము,ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుందాం అని దూసరి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యలు రమ్ బాల్ నాయక్ , రాఘవ, సాయి చంద్ , ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు , టీ ఆర్ యస్ వి నాయకులు కిషోర్ గౌడ్, రామాచారి, యశ్వంత్, సంతీష్ చంద్ర, సంతీష్,తులసీరామ్,తదితరులు పాల్గొన్నారు

- Advertisement -