1,454కి చేరిన కరోనా కేసులు..

334
covid 19
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1454కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 40 పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందినవారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ప్రస్తతుం రాష్ట్రంలో ప్రస్తుతం 461 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి 959 డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరనాబారిన పడి 34 మంది మృతి చెందారు.

- Advertisement -