నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్..

563
nomula bhagath
- Advertisement -

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి పేర్లను ఖరారు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది.దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు ఖరారు చేశారు. మంగళవారం భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్‌) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే.

- Advertisement -