నిజామాబాద్‌ సభాస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

221
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో నేడు నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. ఈ బహిరంగ సభ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతుంది. ఈ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్‌కు చేరుకున్నారు.

సభ ప్రంగణం గులాబీ దళంతో నిండిపోయింది. 2లక్షలకు పైగా ప్రజలు ఈ సభకు హాజరైయ్యారు. ఈ భారీ బహిరంగ సభకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎంపీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -