జీఎస్టీ బకాయిల కోసం టీఆర్ఎస్‌ ఎంపీల నిరసన

464
delhi trs
- Advertisement -

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. ఢిల్లీ పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌తో పాటు నామా నాగేశ్వరరావు,మాలోతు కవిత,బీబీ పాటిల్,మన్నె శ్రీనివాస్ రెడ్డి,పి రాములు,పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవలె జీఎస్టీ బకాయిల కోసం కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 2017-18, 2018-19 ఏడాదికి ఐజీఎస్టీకి సంబంధించి కేంద్రం నుంచి రూ.2,812 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

TRS MPs Protest for IGST Dues..Telangana asks Centre to pay ₹2,812-crore in IGST dues..TRS MPs Protest for IGST Dues

trs mps

- Advertisement -