గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలతో టీఆర్ఎస్ ఎంపీల నిరసన..

90
gandhi statue
- Advertisement -

పార్లమెంట్ ఆవరణలో ని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపోఆల ఆందోళనలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మూడో రోజు టిఆర్ఎస్ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది.రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. రాజ్యసభ లోనూ సభా కార్యకలాపాలను స్తంభింప చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. పోడియం చుట్టుముట్టి రైతులను కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు రైతుల పక్షాన పార్లమెంట్ లో పోరాటం కొనసాగుతుందని టిఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

- Advertisement -