సీఎం కేసీఆర్‌ని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు.

385
kotha prabhakar reddy
- Advertisement -

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..ఎమ్మెల్యే హరీష్‌తో కలిసి ప్రగతి భవన్‌లో సీఎంని కలిశారు. వీరితో పాటు ఎంపీలు దయాకర్,వెంకటేశ్‌,పి రాములు,మన్నె శ్రీనివాస్ రెడ్డి,రంజిత్ రెడ్డి,బీబీ పాటిల్,నామా,మాలోతు కవిత సీఎంని కలిసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్ధానాల్లో టీఆర్ఎస్ 9,బీజేపీ 4,కాంగ్రెస్ 3,ఎంఐఎం ఒక స్ధానాన్ని గెలుచుకున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు వరంగల్‌లో పసునూరి దయాకర్, మహబూబాబాద్‌లో మాలోత్ కవిత, పెద్దపల్లిలో వెంకటేశ్ నేతకాని, నాగర్‌కర్నూలులో పీ రాములు, మహబూబ్‌నగర్‌లో మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్లలో జీ రంజిత్‌రెడ్డి, మెదక్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు విజయదుందుభి మోగించారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం, రాష్ట్ర సమస్యలను కేంద్రం వద్ద ప్రస్తావించటం సీఎం కేసీఆర్ సైనికులతోనే సాధ్యమని విశ్వసించిన ప్రజలు రాష్ట్రంలో గులాబీ పార్టీకి మెజార్టీ స్థానాలను అందించారు.

- Advertisement -