ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కేటీఆర్‌..

79
- Advertisement -

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరిలు, మంగళవారం ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి గెలుపుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిలను కేటీఆర్‌ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, చెన్నమనేని రమేష్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఉన్నారు.

- Advertisement -