నడ్డా ముందు ఇంటగెలిచి రచ్చగెలవాలి: జీవన్ రెడ్డి

129
jeevan
- Advertisement -

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మండిపడ్డారు పియూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జీవన్‌ రెడ్డి…..నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడు అని విమర్శించారు. నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ ఒక లోక్ సభ సీటు తో పాటు మూడు అసెంబ్లీ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోయింది…..నడ్డా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు.

సొంత రాష్ట్రం లో బీజేపీ ఓడిపోవడం తో నడ్డా మతి స్థిమితం కోల్పోయారని….నడ్డా అబద్ధాల బిడ్డ గా మారి మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా అని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేల ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దాం మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధం అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని నడ్డాకు సూచించారు.

బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ గా మారిందని……మిషన్ భగీరథ నీళ్ళతోనే నడ్డాకు స్నానం చేపిస్తాం అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు అదే స్క్రిప్ట్ అమిత్ షా నడ్డా లకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటు లో సమాధాన మిచ్చిందని…. .బీజేపీ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతుందన్నారు. కాళేశ్వరం పై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రి లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏ టు జడ్ స్కాం ల పార్టీ అని…ఇంగ్లీషు లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నీ కుంభ కోణాలు చేసిన పార్టీ బీజేపీ అన్నారు. నడ్డా చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంజయ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి.. ఆయన నేర చరిత్రను బట్టే పోలీసులు వ్యవహరించారని తెలిపారు జీవన్ రెడ్డి. ఉరికించే దగ్గర ఉరికిస్తాం.ఊరుకునేదగ్గర ఊరుకుంటాం….డిపాజిట్లు కోల్పోయే పార్టీ బీజేపీ ఏ యుద్ధం చేస్తుందన్నారు. బీజేపీ ఆట క్లోజ్ అయిందని… బీజేపీ నేతలు తాలిబన్ల లా మారారన్నారు.

- Advertisement -