దుబ్బాకలో టీఆర్ఎస్ ముందంజ..

193
trs
- Advertisement -

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల సరళి టెన్షన్ పెంచుతోంది. ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 11 రౌండ్లు పూర్త‌య్యాయి. ప‌దో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ 456 ఓట్ల‌తో ముందంజ‌లో ఉంది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బీజేపీ లీడ్‌లో ఉండ‌గా, 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 6, 7, 10 రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ 353, 182, 456 ఓట్ల మెజార్టీ సాధించింది.

11వ‌ రౌండ్‌లో బీజేపీ 199 ఓట్ల ముందంజ‌లో ఉంది. దౌల్తాబాద్‌‌, చేగుంట‌, రాయ‌పూర్ మండ‌లాల ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొత్తం 23 రౌండ్ల‌లో లెక్కింపు ప్ర‌క్రియ ముగియ‌నుంది. ప‌ది రౌండ్లు పూర్త‌య్యే స‌రికి బీజేపీ ‌34748, టీఆర్ఎస్ 30815, కాంగ్రెస్ పార్టీ 8582 ఓట్లు సాధించింది. ఇంకా 12 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -