దూసుకుపోతున్న కారు…

406
trs
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కారు దూసుకుపోతోంది. మెజార్టీ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. సూర్యపేట,తిరుమలగిరి అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్ల వద్ద సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అధికారులు తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు.

మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా 3,018 మందిని సూపర్‌వైజర్లుగా, 5,876 మందిని అసిస్టెంట్లుగా నియమించారు. సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -