ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి: ఎమ్మెల్యే రోజా

558
mp santhosh kumar
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ప్రశంసలు గుప్పించారు ఏపీ వైసీపీ నాయకురాలు,నగరి ఎమ్మెల్యే రోజా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి ఈ నెల 26న మొక్కలు నాటుతానని ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్‌పై ప్రశంసలు గుప్పించిన రోజా.. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇక ఇప్పటికే ఏపీకి చెందిను పలువురు నేతలు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన నివాసంలో మొక్కలు నాటడమే కాదు హీరో బాలకృష్ణ ,సినీ నిర్మాత అశ్వినీ దత్ ,మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వర్ నాథ్ కు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. ఇందులో చాముండేశ్వర్ నాథ్,అశ్వినీ దత్ మొక్కలు నాటి మరో ముగ్గురిని ఛాలెంజ్ ఇచ్చారు.

roja

- Advertisement -