రాజగోపాల్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి..

54
bjp
- Advertisement -

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేతృత్వంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయనే ఒప్పుకొన్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుని, అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని, మునుగోడులో ఓట్లు కొంటున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ రూ.18 వేల కోట్లలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాటా ఉందని వారు విమర్శించారు.

- Advertisement -