హైదరాబాద్ ఎమ్మెల్సీ… ఆధిక్యంలో టీఆర్ఎస్‌

138
vanidevi
- Advertisement -

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్‌ ఎమ్మెల్సీ స్ధానంలో ఆధిక్యంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ఇప్పటివరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడికాగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై 6555 ఓట్ల ముందంజలో ఉన్నారు.

ఐదో రౌండ్‎ వరకు టీఆర్ఎస్‌కు 88,304 ఓట్లు రాగా, బీజేపీకి 81,749 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 42,604 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440, టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణకు 4,656 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఐదు రౌండ్లలో కలిపి 16,712 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 2,80,030 ఓట్లు లెక్కించారు.

ఇక, నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల స్థానంలో మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తికాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీన్మార్‌ మల్లన్నపై టీఆర్‌ఎస్‌ 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -