రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్…

139
harish
- Advertisement -

కరోనా సంక్షోభ వేళ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. ఇప్పటికే చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం…తాజాగా
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రంఇంచార్జీ అధికారిదే బాధ్యత అని హరీష్ రావు పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన హరీశ్… ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

- Advertisement -