దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం: కవిత

156
mlc k kavitha
- Advertisement -

దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వివిధ ‌ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి చర్చించారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు‌.

రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.90 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3016కు పెన్షన్ తో‌ పాటు…అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. గత ఆరేండ్లుగా దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు దివ్యాంగులు ఈ‌ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -