అభివృద్ధి నినాదమే మా ఎజెండా : మంత్రి సబితా

56
sabhita
- Advertisement -
రంగారెడ్డి జిల్లాలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో రూ.20కోట్లతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జల్‌పల్లి  మున్సిపాలటీలో  పలు అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నినాదాలని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 10 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా జల్‌పల్లిలోనే నాలుగు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. డివిజన్లలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేస్తామని హామినిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హా నాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -