‘వాజ్‌ పేయి ఇకలేరు’..దుమ్మెత్తిపోసిన నెటిజన్లు..!

247
- Advertisement -

త్రిపుర గరవర్నర్‌ తథాగత రాయ్‌ చేసిన ట్వీట్‌ కలకలం రేపింది. ఆయన చేసిన ట్విట్‌ క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘గొప్ప వక్త, ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ధ్రువతారలా వెలిగిన మాజీ ప్రధాని వాజ్ పేయి ఇకలేరు. ఓం శాంతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌ కి బదులుగా త్రిపుర గవర్నర్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
Tathagataఆ తర్వాత నాలుక కరుచుకున్న తథాగత రాయ్ తన ట్వీట్ ను తొలగించి..’నన్ను క్షమించండి. ఓ జాతీయ టీవీ చానల్ లో వచ్చిన వార్తను చూసి నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసే ముందు అది నిజమా, కాదా? అనే విషయాన్ని తెలుసుకుని ఉండాల్సింది. వాజపేయి గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదు. నా ట్వీట్ ను తొలగించాను. క్షమించండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. వాజ్ పేయికి చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు ఒక బులెటిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

.. Tripura Governor Tathagata Roy

- Advertisement -