‘అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’

195
- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు , వరదల పరిస్థితిని , ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్షించారు. రాష్ర్టవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు,  రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు.

 KCR

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే. జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డిలతో సీఎం మాట్లాడారు. అయితే ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తూ.. స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

సెక్రటేరియట్ లో కూడా సీనియర్‌ అధికారి నేతృత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో , నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులోనే ఉండి , అధికారులు పోలీసుల సహకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా.. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నచోట అప్రమత్తంగా ఉండాలని కోరారు.

- Advertisement -