పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా..

143
TPCC Chief
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. కాగా, ఈ మహమ్మారి దాటికి సామాన్యులతో పాటు వీవీఐపీలు సైతం ప్రభావితమవుతున్నారు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు.

- Advertisement -