మొక్కలు నాటిన టాలీవుడ్ సింగర్లు, రచయితలు..

431
tollywood
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు ఫిల్మ్ నగర్‌లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ లోని సురవరం ప్రతాప్ రెడ్డి మెమోరియల్ పార్క్ వద్ద ప్రముఖ టాలీవుడ్ సింగర్స్ మరియు రచయితలు మొక్కలు నాటారు. ఈ అవకాశం కల్పించిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు.

green challenge

పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన సంతోష్ కుమార్ కోట్లాది మందిలో కొత్త స్ఫూర్తిని నింపారని కొనియాడారు. తమకు గాయకులుగా… రచయితలుగా వచ్చిన గుర్తింపు కంటే… ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పర్యావరణ ప్రేమికులుగా వచ్చే పేరు ఎంతో సంతృప్తిని ఇస్తుందని పలువురు ప్రముఖులుపేర్కొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిని.. ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాన్ని కలిపి ముందుకు సాగుస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

green challenge 1

మొక్కటు నాటి వారిలో చంద్ర బోస్, విజయ లక్ష్మి, మంగ్లీ, రవి వర్మ, మిట్టపల్లి సురేందర్, స్ఫూర్తి, లెనీన చౌదరి, వేణు, బోలే శావలి ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, సినీ నటుడు కాదంబరి కిరణ్ మరియు ప్రతినిధి కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.

tollywood green challenge

- Advertisement -