దాస‌రి స్ధానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరుః సురేష్ బాబు

259
sureshbabu
- Advertisement -

ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు స్ధానాన్ని తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌న్నారు ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు. ఇండ‌స్ట్రీలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని దాసరి ప‌ట్టించుకునేవార‌ని..అంద‌రి స‌మ‌స్య‌లు తీర్చ‌డంలో దాస‌రి ముందుండే వార‌న్నారు. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని త‌న స‌మ‌స్య‌లుగా భావించి త‌న భుజాల మీద వేసుకుని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నించేవార‌న్నారు.

dasari, suresh babu

దాస‌రి నారాయ‌ణ రావు చాలామందికి సాయం చేశార‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్ధితులు చూస్తుంటే ఇండస్ట్రీలో అలాంటి మ‌నిషి మ‌ళ్లి క‌నిపించ‌డం లేద‌న్నారు. అంద‌రూ దాస‌రి లేని లోటు గురించి మాట్లాడేవాళ్లే కానీ ఆయ‌నలా ఆలోచించి..బాధ్య‌త తీసుకునే వాళ్లు క‌నిపించ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా మంది కొత్త వాళ్లు వ‌చ్చార‌ని..ఎవ‌రి మాట ఎవ‌రూ వినే ప‌రిస్ధితులు లేవ‌న్నారు.

ఒక ప‌ది సంవ‌త్సారాల క్రింద దాస‌రి, త‌న తండ్రి రామానాయులు లాంటి వారు చెబితే వినేవార‌ని ఇప్పుడు అలాంటి ప‌రిస్ధితులు లేవ‌న్నారు. నిర్మాతల మండ‌లి విష‌యాన్నే చూసుకుంటే అందులో 1000మంది స‌భ్యులుంటార‌ని అక్క‌డ ఏదైనా విష‌యం చెబితే అంద‌రితో ఓకే అనిపించ‌డం క‌ష్టం మ‌వుతోంద‌న్నారు.

- Advertisement -