గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన నిర్మాత దిల్ రాజు

455
Dil Raju Green Challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తన నివాసం ఆవరణలోని గార్జెన్ లో మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నా మిత్రులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల మన రాష్ట్రం, దేశం ఆకుపచ్చగా మారబోతున్నదని అన్నారు.

green

ఈసందర్భంగా ఈ కార్యక్రమంలో తాను కూడా బాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మరొక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నానని వారు కూడా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు 1)ప్రముఖ హీరో మహేష్ బాబు 2) డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి 3)అనిల్ రావిపూడి లను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -