సీఎం కేసీఆర్ సెక్యులరిస్ట్: టీఎన్జీవో రవీందర్ రెడ్డి

391
tngo ravinder reddy
- Advertisement -

నూతన సచివాలయ ప్రాంగణంలో అధునాతనమైన హంగులతో కొత్త మసీదును మరియు దేవాలయాలను నిర్మిస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు టీఎన్జీవో నాయకులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్.

సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలనుంచి పనుల నిమిత్తం వచ్చిన ఉద్యోగులకు, ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని కొత్త మసీదు మరియు దేవాలయాలు కలిగిస్తాయన్నారు.

పాత సచివాలయ భవనాలు కూల్చివేస్తున్న సందర్భంగా మసీదు, నల్ల పోచమ్మ దేవాలయాలు ధ్వంసం కావడంపట్ల బాధను వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ సహృదయంతో వెంటనే స్పందించి నూతన సచివాలయంలో అందరి మనోభావాలకు అనుగుణంగా మసీదును, నల్ల పోచమ్మ దేవాలయాలను నిర్మిస్తామని చెప్పడం కెసిఆర్ గొప్పతనానికి సెక్యులరిజానికి నిదర్శనం అన్నారు.

- Advertisement -