ప్రశాంత్ కిశోర్‌పై తృణమూల్ ఎంపీ సెటైర్లు

95
pk
- Advertisement -

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సెటైర్లు వేశారు. ఓ కాంట్రాక్టర్ రాజకీయ పార్టీని నడపలేడని చురకలు అంటించిన కళ్యాణ్..రాజ‌కీయ పార్టీని రాజ‌కీయ పార్టీలాగే న‌డ‌పాల‌ని విమర్శలు గుప్పించారు.

తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ బోర్డుకు ఐప్యాక్ ప‌లువురిని నియ‌మించింద‌ని…ఇందులో వారి జోక్యం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తన పరిధిలో ఉండాలని మండిపడ్డారు.

అయితే వాస్తవానికి బెంగాల్లో తృణమూల్ అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌దే కీలక పాత్ర. ప్ర‌జ‌ల ముంగిటే ప్ర‌భుత్వం, బెంగాల్ త‌న కూతురినే కోరుకుంటోందనే ఆక‌ర్ష‌ణీయ నినాదాల‌తో ప్ర‌శాంత్ కిషోర్ ఎత్తుగ‌డ‌లు టీఎంసీకి ప్ర‌జ‌ల నుంచి మెరుగైన ఆద‌ర‌ణ ల‌భించేలా చేశారు.

- Advertisement -