తిరుమల అప్‌డేట్…

34
ttd
- Advertisement -

శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకోగా 32,894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇక ఆగస్టు 8 నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈనెల 9న శ్రీవారి పాదాలకు చత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -