తిరగబడరసామీ..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

5
- Advertisement -

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షో రీల్ ని స్క్రీన్ చేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’ఈ ఈవెంట్ విచ్చేసిన అందరికీ థాంక్ యూ. మా దర్శకుడు రవికుమార్ చౌదరి గారు తిరగబడరసామీ కథ చెప్పగానే విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. గొప్పగా హ్యాండిల్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ వున్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్. మా నిర్మాత శివకుమార్ గారు ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. మాల్వీ మల్హోత్ర చాలా మంచి యాక్టర్. ఇది ఆమె తొలి తెలుగు సినిమా. ఆమెను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సినిమా కోసం అందరం కష్టపడ్డాం. కానీ మా కెమరామెన్ జవహర్ రెడ్డి గారు మా అందరి కంటే ఎక్కువ కష్టపడ్డారు. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. ఆయన చాలా మంచి లోకేషన్స్, యాక్టర్స్ ఇచ్చారు. జవహర్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ప్రాణం పెట్టి చేశాడు. ఈ క్యారెక్టర్ ని చాలా బ్యాలెన్స్ గా చేశారు. మాల్వి తెలుగమ్మాయిలానే వుంటుంది. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’ చెప్పారు.

హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ‘‘మంచి టీమ్‌తో కలిసి వర్క్‌ చేసినందుకు హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. తెలుగులో పరిచయం చేస్తున్నందుకు ఈ టీమ్‌కు ధన్యవాదాలు. ఇక్కడ మరెన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ అందరికీ నమస్కారం. ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భార్యాభర్తల అనుబంధం గురించి సినిమాలో అద్భుతంగా చూపించాం. తన భార్యను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏవిధంగా పోరాటం చేశాడనే అంశాన్ని సినిమాలో చాలా అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించారు. సినిమా చాలా బావొచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దాం. అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

Also Read:తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్

- Advertisement -