టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలి

240
Motkupalli Narasimhulu
- Advertisement -

తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన తర్వాత మోత్కుపల్లి మాట్లాడుతూ  టీఆర్ఎస్ కూడా మన పార్టీనే అని.. అందులో కలిసిపోతే తప్పులేదన్నారు. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ టీఆర్ఎస్ లో విలీనం చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు.చంద్రబాబుకు ఏపీలో ఎన్ని పనులు ఉన్నా..  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించి ఉంటే బాగుండేదని. తెలంగాణలో టీడీపీకి మనుగడే లేదని అన్నారు  మోత్కుపల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని, పార్టీని విలీనం చేస్తే మిత్రుడికి సాయం చేశామన్న పేరు అయినా దక్కుతుందన్నారు.

motukupalli

టీడీపీ నేతలు మానసికక్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ పూర్తిగా లేదనిపించుకోవడం కంటే.. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే బెటర్ అన్నారు. పార్టీని విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చంద్రబాబుకి వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నానని, అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి నరసింహులు.

- Advertisement -