Raviteja:టైగర్ నాగేశ్వరరావు… బ్లాక్ బస్టర్

27
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, మలినేని గోపీచంద్, బివీఎస్ రవి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, నవీన్ యర్నేని, వివేక్, సుధాకర్ చెరుకూరి, మిర్యాల రవీందర్, నాగవంశీ పాల్గొన్న ఈ ఈవెంట్ వేడుకగా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా గురువు గారు విజయేంద్రప్రసాద్ గారికి, కేంద్రమంత్రి నంద్ గోపాల్ గుప్తా గారికి, ఈ వేడుకు విచ్చేసిన నా తమ్ముళ్ళు లాంటి దర్శకులు హరీష్, రవి, గోపికి, నిర్మాతలకు, నా అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతి బ్లాక్ అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం మా డీవోపీ మధి. మా యాక్షన్ కొరియోగ్రఫర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ చాలా బ్రిలియంట్ యాక్షన్ ని డిజైన్ చేశారు. రియల్ లోకేషన్స్ రియల్ యాక్షన్. ఈ సినిమా యాక్షన్ ఎమోషన్ ఇంత రియల్ గా రావడానికి మరో కారణం రామ్ లక్ష్మణ్ కూడా ఆ ప్రాంతం వారే. టైగర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు. వంశీ ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా మిమ్మల్ని గట్టిగా అలరిస్తుందని నమ్ముతున్నాను. రేణు దేశాయ్ గారు చాలా రోజుల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆ పాత్రకు మ్యాచ్ చేశారు. శ్రీకాంత్ విస్సా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ ఫీల్ అవుతారు. అనుకృతి కీలకమైన పాత్ర చేసింది. నూపూర్, గాయత్రి బ్యూటీఫుల్ హీరోయిన్స్. క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అభిషేక్ అగర్వాల్‌ ఎక్కడా రాజీపడకుండా తీశారు. సినిమా చాలా భారీ వుంటుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. తనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జీవి ప్రకాష్ మ్యూజిక్ కి చాలా థ్రిల్ ఫీలౌతారు. సౌండ్ థియేటర్ లో ఎలా వుంటుందో చూడటానికి ఎదురుచూస్తున్నా. వంశీ నుంచి ఇలాంటి కన్విక్సన్ నేను ఊహించలేదు. అంత అద్భుతంగా చేశాడు. అది ప్రేక్షకులు కూడా చూస్తారు. వంశీ గురించి రిలీజ్ తర్వాత గట్టిగా మాట్లాడతా. ఈ సినిమా అక్టోబర్ 20న మీ అందరినీ అలరించడానికి వస్తుంది. ఎమోషన్.. థ్రిల్..యాక్షన్ అన్ని ఎమోషన్స్ ఇందులో వున్నాయి. అలాగే మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా విడుదలౌతుంది. అలాగే విజయ్ సినిమా కూడా వస్తుంది.. అన్నీ సినిమాలు సూపర్ హిట్లు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read:Bigg Boss 7 Telugu:7వ వారం నామినేషన్స్‌లో ఉంది వీరే

దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్‌ గారికి ముందుకు థాంక్స్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ని చాలా బలంగా నమ్మారు. రవితేజ గారు కొత్త ప్రతిభని, దర్శకులని ప్రోత్సహిస్తారని చాలా మంది చెప్తారు. కానీ ఇందులో మరో విశేషం ఏమిటంటే ఆయన సక్సెస్ ఫెయిల్యుర్ ని చూడరు. ఆయన ఈ సినిమా కోసం నన్ను బలంగా నమ్మారు. ఇది నాకు చాలా గొప్ప మూమెంట్. ఇది రవితేజ గారి వలనే సాధ్య పడింది. విజయేంద్ర ప్రసాద్ కాల్ చేసిన ప్రత్యేకంగా ప్రశసించడం ఆనందంగా వుంది. నుపూర్, గాయత్రి, రేణు గా చక్కని పాత్రలు పోషించారు. మధీ, జీవి ప్రకాష్, అవినాష్ బ్రిలియంట్ వర్క్ చేశారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దాదాపు నాలుగేళ్ల ప్రయాణం. ఏ మాత్రం ఒత్తిడి లేదు. ఎందుకంటే సినిమా చూశాను. మీరు అనుకునే దాని కంటే మించి వుంటుంది. మీరు చూసిన ప్రతి సెకండ్ బయటికి వచ్చి మళ్ళీ చూడాలని అనుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘టైగర్ నాగేశ్వరరావు’ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అన్నారు.

Also Read:నవాబ్…ఫస్ట్ లుక్

- Advertisement -