మీ ఆలోచన అద్భుతం- ఎంపీ సంతోష్‌

186
- Advertisement -

ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒకరినొకరు మొక్కను బహుమతిగా ఇచ్చుకొని ఈ పండుగ జరుపుకోవాలని ఒడిశాలోని పూరి బీచ్‌లో ఇసుకతో ఆర్ట్ వేసి సోదర,సోదరీమణులుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ,ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్పందించారు.

రక్షాబంధన్ పురస్కరించుకుని మొక్కను బహుమతిగా ఇవ్వాలన్న మీ ఆలోచన అసాధారణమైనదని చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సుదర్శన్ పట్నాయక్‌ను అభినందించారు. ఈ రక్షాబంధన్ ప్రకృతికి మరింత పచ్చదనాన్ని ఇస్తుందని పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం చాలా అవసరం అని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -