ఆ స్టార్ హీరోలు చనిపోతారట

48
- Advertisement -

కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారి కంటే… నేనే భగవంతుడిని అని చెప్పుకునే వారే ఎక్కువమంది కనిపిస్తూ ఉంటారు. ఇక దేవుడు కూడా మార్చలేని భవిష్యత్తును తాను మారుస్తా అంటూ కబుర్లు చెబుతుంటాడు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ముఖ్యంగా సినీ ప్రముఖుల ప్రమేయం లేకుండానే వారి జాతకాలను నోటికొచ్చినట్టు చెబుతూ పాపులారిటీ సంపాదించాడు వేణు స్వామి. తాజాగా ఇతగాడు వాగిన వాగుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

దీనికి కారణం గతంలో ఇతను చెప్పినవి కొన్ని నిజం అయ్యాయి. చైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పాడు ఈ జ్యోతిష్యుడు. అలాగే, ఇటీవల ప్రభాస్ జాతకం బాగోలేదని.. అతనికి ఏదీ కలిసి రాదని కూడా చెప్పాడు. అంతకుముందు టాలీవుడ్ హీరో చనిపోతాడని చెప్పిన కొన్ని రోజులకే తారకరత్న మృతి చెందాడు. తాజాగా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండస్ట్రీకి భయం పట్టుకుంది. 2026 లోపు ఆ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారని వేణు స్వామి తెలిపాడు.

Also Read: ప్చ్.. సింగర్స్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది

అనారోగ్యంతో ఒకరు, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య చేసుకుంటారన్నారని డిటైల్డ్ గా చెప్పాడు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అన్నది మాత్రం వేణు స్వామి వెల్లడించలేదు. సినీ ప్రముఖులు కూడా వేణు స్వామిని బలంగా నమ్ముతుండటం ఆశ్చర్యకరం. గతంలో వేణు స్వామి, స్టార్ హీరోయిన్లు రష్మిక, నిధి అగర్వాల్, పూజా హెగ్డే వంటి వారికి పూజలు కూడా చేశాడు. ఇంతకీ ఈ సారి వేణు స్వామి మాటలు నిజం కాకూడదు అని కోరుకుందాం.

Also Read: ఇటలీలో ప్రభాస్.. దాని కోసమే !

- Advertisement -