ఇది గొప్ప విజయం: కోహ్లీ

217
kohli
- Advertisement -

ఆసీస్‌ గడ్డపై కోహ్లీ సేన తిరుగులేని విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 72 సంవత్సరాల భారత విజయకాంక్షను నెరవేర్చిన కోహ్లీ సేన చరిత్రసృష్టించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన కోహ్లీ తన జీవితంలో ఇదే గొప్ప విజయమని తెలిపారు.

భారత్ జట్టుకి ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదని వెల్లడించాడు. గత 12 నెలలుగా జట్టులో ఈ గెలుపు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే నేను తొలిసారి టెస్టు కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు అందుకున్నా. ఇప్పుడు గొప్ప ఆటగాళ్లతో నిండిన జట్టుని నడిపిస్తున్నందుకు గర్వపడుతున్నాను ఆనందం వ్యక్తం చేశాడు.

వర్షం కారణంగా నాలుగో టెస్టు మ్యాచ్ వ డ్రాగా ముగియగా.. భారత్ జట్టు 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌‌లో గెలుపొందగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా
కెప్టెన్‌గానూ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.

- Advertisement -