థియేటర్ల పోరు.. పోటీ రసవత్తరం

61
- Advertisement -

రానున్న సంక్రాంతికి తెలుగు తెర పై రసవత్తరమైన పోటీ ఉండబోతుంది. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, వారసుడు.. ఇలా మూడు సినిమాలు సై అంటే సై అంటున్నాయి. అందుకే, ఈ సినిమాలకు థియేటర్స్ ఇష్యూ ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది. ఇంతకీ ఈ మూడింటిలో ఏ సినిమాకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. నేటివిటీ పేరుతో వారసుడు సినిమాకే తక్కువ థియేటర్స్ ఇస్తున్నారని సమాధానం వినిపిస్తోంది. బాలయ్య వీర సింహా రెడ్డిను భారీగా విడుదల చేస్తున్నారు. అలాగే మరో భారీ సినిమా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కు కూడా భారీ రిలీజ్ ఉంటుంది. ఈ రెండు సినిమాల దెబ్బకు వారసుడు కు ఎక్కువ థియేటర్స్ కష్టమే అని టాక్. మరోపక్క నిర్మాత దిల్ రాజు వారసుడు కోసం థియేటర్స్ ను హోల్డ్ చేయలేకపోతున్నాడు. తన సినిమాకి మంచి థియేటర్ లు సెట్ చేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నా.. అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

గుంటూరు లాంటి సిటీలో బాలయ్య సినిమాకు ఆరు థియేటర్లు వుంటే, మెగాస్టార్ సినిమాకు ఆరు, వారసుడు సినిమాకు మాత్రం మూడు థియేటర్లు దొరకుతున్నాయని తెలుస్తోంది. అంతే కాదు ప్రయిమ్ థియేటర్లు అన్నీ బాలయ్య – మెగాస్టార్ సినిమాకు వెళ్లిపోతున్నాయని టాక్ వుంది. తన చేతిలో థియేటర్స్ ను కూడా దిల్ రాజు తన సినిమా కోసం ఆపుకోలేని పొజిషన్ లో ఉన్నాడు. ఇటు బాలయ్య, అటు చిరు మంచి థియేటర్స్ కోసం పట్టు బడుతున్నారు. వారిని కాదు అని దిల్ రాజు మరో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. మరీ చివరకు ఏమి అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -