మాజీ ఎంపీ కవితను కలిసిన సెర్ఫ్ ఉద్యోగులు

511
kavitha
- Advertisement -

హైదరాబాద్‌లో మాజీ ఎంపీ కవితను కలిశారు సెర్ఫ్ ఉద్యోగులు. నిజామాబాద్ జిల్లా, కమ్మరపల్లి మండల సమాఖ్య పరిధిలోని నర్సాపూర్ గ్రామ సమాఖ్య ద్వారా తయారు చేస్తున్న పిండివంటలు భలే రుచిగా ఉన్నాయని కవిత అన్నారు.

మహిళా సంఘాలు చేపట్టే ఆదాయ వృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం రూ. 619 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మహిళల సంక్షేమం, సెర్ప్ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం భాద్యత అని ఆమె పేర్కొన్నారు.

వడ్డీలేని రుణాల కింద రూ. 619 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పూలు, బొకేలకు బదులుగా వారు తయారుచేసిన పిండివంటలు ఆమెకు బహూకరించారు. వాటి రుచి చూసిన ఆమె భలే రుచిగా ఉన్నాయని వారిని అభినందించారు. కవితను కలిసిన వారిలో నరసయ్య, సుదర్శన్, సుభాష్‌గిరి, రాజారెడ్డి, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -