తూత్తుకూడి బాధితులకు విజయ్ పరామర్శ..

234
- Advertisement -

తమిళనాడులోని తూత్తుకూడి బాధితులను పరామర్శించారు స్టార్ హీరో విజయ్. అర్ధరాత్రి బైక్‌పై తూత్తుకూడికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన విజయ్‌…పేరు పేరునా వారిని పలకరించారు.

తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్,కమల్ హాసన్‌ బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అంతేగాదు రజనీ బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

tamindu

భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని స్ధానికులు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆందోళనను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా 11 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అన్నివర్గాల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో చివరికి ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

tamil vijay

- Advertisement -