భారీ వర్షాలు..ఎన్టీఆర్ సాయం

6
- Advertisement -

వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఎన్టీఆర్… అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను అని వెల్లడించారు.

 

Also Read:ఇదే చిట్టచివరి హెచ్చరిక..ప్రకృతి చెబుతుంది ఇదేనా!

- Advertisement -