లక్కీ డ్రా..తెలుగు వ్యక్తి జాక్‌పాట్

6
- Advertisement -

దుబాయ్‌లో తెలుగు వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టారు. ఏపీ నుండి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్‌ బోరుగడ్డ నాగేంద్రమ్‌ను అదృష్టం తలుపుతట్టింది.సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది.

నాగేంద్రమ్‌ మాట్లాడుతూ..తాను 2017లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వచ్చానని అప్పటినుండి నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేస్తున్నానని తెలిపారు. తన కుటుంబానికి, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఆకాంక్షతో తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అయితే అనుకోకుండా తనకు అదృష్టం వరించిందని చెప్పారు.

Also Read:ఆగస్టు 15న.. ‘ఆయ్’

- Advertisement -